గంగాధర, జూన్ 7: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి నియోజకవర్గం కోనసీమలా రూపుదిద్దుకున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో ఏడారిని తలపించిన వరదకాలువ ఇప్పుడు జీవనదిలా మారిందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కురిక్యాల శుభమస్తు ఫంక్షన్హాల్లో బుధవారం సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రైతులు, మహిళలతో కలిసి సీఎం కేసీఆ ర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తొమ్మిదేళ్ల కాలంలో సాగనీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలపై ముద్రించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గం కరువుకాటలతో దుర్భిక్షంగా మారిందన్నారు. సాగు, తాగునీటి కోసం ప్రజానీకం అష్టకష్టాలు పడ్డదన్నారు.
ఎక్కడికెళ్లినా బీడు భూములు కనిపించేవన్నారు. వ్యవసాయం దండుగనుకుని రైతులు తమ భూములను అగ్గువ ధరకు అమ్ముకుని ఉపాధి కోసం దుబాయ్ బాట పట్టారని గుర్తు చేశారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సాగురంగాన్ని పండుగలా మార్చారని కొ నియాడారు. నారాయణపూర్ రిజర్వాయర్తో చొప్పదండి నియోజకవర్గం పచ్చదనంతో కళకళలాడుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఎం పీపీలు శ్రీరాం మధుకర్, చిలుక రవీందర్, పర్లపెల్లి వేణుగోపాల్, జడ్పీటీసీలు పునుగోటి ప్ర శాంతి, పుల్కం అనురాధ, ఏఎంపీ చైర్మన్లు ఎ ల్లయ్య, తిరుపతి, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, వెలిచాల తిర్మల్రావు, ఆర్బీఎస్ కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ద్యావ మధుసూదన్రెడ్డి, మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, ఇరిగేషన్ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.