గంగాధర, మే 24: ఉద్యోగాల క్రమబద్ధీకరణపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం గంగాధర పంచాయతీ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్కు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, అన్ని వర్గాలకు మేలు చేస్తున్న సీఎంకేసీఆర్కు రుణపడి ఉంటామని చెప్పారు.
ఇక్కడ ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, మండల పరిషత్ ధ్యక్షుడు మేచినేని నవీన్రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, కంకణాల విజేందర్రెడ్డి, జోగు లక్ష్మీరాజం, దోర్నాల హన్మంతరెడ్డి, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు రామిడి సురేందర్, అలువాల తిరుపతి, చిలుముల రమేశ్ పాల్గొన్నారు.