చొప్పదండి, అక్టోబర్ 28: వానకాలంలో పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. చొప్పదండి పీఏసీఎస్ ఆధ్వర్యంలో చొప్పదండి వ్యవసాయ మార్కెట్, రుక్మాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. చొప్పదండిలోని 5వ వార్డు పరిధిలో 5లక్షలతో నిర్మిస్తున్న పద్మశాలీ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయాచోట్ల ఆయన మాట్లాడారు. పంటపెట్టుబడి నుంచి ధాన్యం కొనేదాకా రైతాంగానికి రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని చెప్పారు.
అన్నదాతలు దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను నాటి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమాల్లో సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ ఎంపీపీ వొల్లాల కృష్ణహరి, సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, పెద్దిశంకర్, చిలుకలింగయ్య, లింగంపెల్లి లావణ్య, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేశ్, బిజిలి అనిత, సింగిల్విండో వైస్ చైర్మన్ ముద్ద మల్లేశ్గౌడ్, డైరెక్టర్లు సత్తు నర్సయ్య, పద్మ. కొమురయ్య, బీ(టీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోకరాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.