వేములవాడ టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి హుండీ ఆదాయం సుమారు 95 లక్షలు సమకూరింది. హుండీలను మంగళవారం ఆలయ ఓపెన్స్లాబ్లో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.94,60,590 సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు.
ఇందులో స్వామివారికి బంగారం 89గ్రాములు, వెండి 4కిలోల 950గ్రాములు ఆదాయం గా సమకూరింది. ఈ ఆదాయం కేవలం అయిదురోజులదని ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో హరికిషన్, జయకుమారి, నవీన్, బీ శ్రీనివాస్, పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు, సత్యసాయిసేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.