గంగాధర, జూన్ 9 : తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తరుణంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని, ఈ శుభ సందర్భంలో మరో పదేండ్ల ప్రగతికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గం గాధర మండలం మధురానగర్ వీఏఎస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సంక్షేమ సంబురాలు నిర్వ హించారు. డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోలు విన్యాసా లు, బతుకమ్మలు, బోనాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఫంక్షన్ హాల్ వరకు తీసిన ర్యాలీలో ఎమ్మెల్యే రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. వినోద్కుమార్, ఎమ్మెల్యేను నాయకులు గజమాలతో సత్కరించారు. మల్యాల ఏఎంసీ చైర్మన్ నరేందర్రెడ్డి వినోద్కు నాగలిని బహూకరించారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భం గా వినోద్ మాట్లాడుతూ, 2014 ఎన్నికల సందర్భంలో వరదకాలువ జీవనదిలా మారుతుందని, మత్స్య సంపద, గొర్రెలు, మేకలు, పశు సంపద పెరుగుతుందని చెప్పానని, ఇప్పుడు కండ్ల ముం దు కనిపిస్తున్నదన్నారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ను ప్రారంభించి కొట్లాడి తెలంగాణను సాధించారని కొనియాడారు. ఈ సమయంలో ఆయన వెంట నడిచానని చెప్పారు. ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్ తీగెల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని వెటకారమాడాడని, కానీ, ఇప్పుడు తెలంగాణలో నాణ్యమైన కరెంట్తో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో 7, 778 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి ఉంటే, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. గోదావరి, కృష్ణా జలాలతో రాష్ట్రంలోని కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపా రు.
గతంలో పూర్వపు కరీంనగర్లో రెండు ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉంటే ఇప్పుడు నాలుగు ప్రభు త్వ కళాశాలలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. 500 పడకల దవాఖానను ఏర్పాటు చేసి మెరుగైన సేవలందుతాయని చెప్పారు. పేద పిల్లలకు మెరుగైన విద్యనందించేందుకు అన్ని హంగులతో సర్కారు గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి రూ. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాల్లో, ప్రజల్లో చర్చించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఏఎంసీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కే మళ్లీ పట్టంగట్టాలె..
సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఉమ్మడి పాలనలో అంధకారంలో ఉన్న తెలంగాణ, ఇప్పుడు ఇక్కడ క రెంట్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. దేశం లో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు సర్కారే రూ. లక్ష కట్నం పెడుతున్నది. సాగు పెట్టుబడి కోసం ఏడాదికి ఎకరాకు రూ. 10వేలు అందిస్తున్నది. దురదృష్టవశాత్తూ రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుం డా రైతుబీమా 5 లక్షల పరిహారం ఇస్తున్నది. అంధత్వ నివారణకు కంటివెలుగును చేపట్టిం ది. గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధికి సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేస్తున్నది. పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం గురుకులాను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. రాష్ట్రం లో కుల వృత్తులను ప్రోత్సహించడానికి రూ.లక్ష ఆర్థిక సా యం అందజేస్తున్నది. ప్రజాసంక్షేమాన్ని కాం క్షించే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్లీ పట్టం గట్టాలి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే