గంగాధర, జనవరి 24: నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం ఇంటింటా జ్వర సర్వే పకడ్బందీగా చేపట్టారు. గంగాధర మండలంలోని కాసారం, గంగాధర, బూరుగుపల్లి, నారాయణపూర్ గ్రామాల్లో సర్పంచులు వేముల దామోదర్, మడ్లపెల్లి గంగాధర్, సాగి రమ్య, ఎండీ నజీర్ ఆధ్వర్యంలో వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు సోమవారం ఇంటింటా జ్వర సర్వే చేశారు. కాసారంలో 118 ఇండ్లల్లో సర్వే చేశారు. కరోనా లక్షణాలు ఉన్న 10 మందికి మెడికల్ కిట్లు అందజేశారు. గంగాధరలో 495 ఇండ్లల్లో సర్వే చేసి జ్వరంతో బాధపడుతున్న 15 మందికి మెడికల్ కిట్లు అందజేశారు. బూరుగుపల్లిలో 2035 మంది ఆరోగ్య వివరాలు సేకరించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న నలుగురికి మెడికల్ కిట్లు అందజేశారు. బూరుగుపల్లిలో జ్వర సర్వేను గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్రావు పరిశీలించారు. నారాయణపూర్లో 286 ఇండ్లల్లో సర్వే చేశారు. జ్వరంతో బాధపడుతున్న 9 మందిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేశారు.
రామడుగు, జనవరి 22: మండలంలో వైద్య సిబ్బంది నాలుగోరోజు ఇంటింటా జ్వర సర్వే చేపట్టారు. గుండి-గోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 25 టీంలు 14 గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించారు. 12 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి మందులు అందజేసినట్లు వైద్యాధికారి సురేశ్ తెలిపారు. 108 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. 156 మందికి మొదటి, రెండో డోసుతో పాటు బూస్టర్ డోసు వేసినట్లు తెలిపారు. రామడుగు పీహెచ్సీ పరిధిలో 21 టీంలు 1,050 నివాసాల్లో ఆరోగ్య వివరాలు సేకరించినట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. 22 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి మందులు అందజేసినట్లు పేర్కొన్నారు. 45 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో వైద్యాధికారులు శ్రీనివాస్, సురేశ్, శిరీష, సీహెచ్వో నారాయణ, సూర్వైజర్ పవన్కుమార్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.