గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఓలాద్రి మల్లారెడ్డి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఇంటర్మీడియట్ పూర్తికాగానే బీఎస్ఎఫ్ సరిహద్దు భద్రతా దళంలో చేరాడు. రాజస్థాన్, జమ్ముకాశ్మీర్, గుజరాత్, పంజాబ్ రాష్ర్టాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో 38ఏండ్ల పాటు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించాడు. కార్గిల్ యుద్ధంలో సైతం పాల్గొన్నాడు. పంజాబ్ సరిహద్దులో సేవలందించి, సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఆదివారం పదవీ విరమణ పొందాడు. మల్లారెడ్డి ఇన్నాళ్లూ దేశ రక్షణ కోసం పని చేసి, ప్రస్తుతం గ్రామానికి తిరిగి వస్తుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.