విద్యానగర్, జూన్ 14: ‘ఒకప్పుడు ఏదైనా రోగం వస్తే ‘నేను రాను బిడ్డో సరారు దవాఖాన’కు అనే రోజులుండేవి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానకు పోతే బిల్లులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితులుండేవి. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో వైద్య రంగం అద్భుత ప్రగతి సా ధించింది. అనేక మార్పులు, ఎన్నో సంసరణలు తేవడంతో ప్రైవేట్ను మించి ప్రభుత్వం వైద్యం అందుతున్నది’ అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని శుభం గార్డెన్స్లో బుధవారం నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవంలో పాల్గొన్నారు. గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసి ఆశీర్వదించారు. అనంతరం వైద్య సిబ్బందిని సన్మానించి, మాట్లాడారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, దేవుడు ఇచ్చిన వరంగా భావించి ప్రజలకు సేవలందించాలని సూచించిన ఆయన, రాష్ట్రం సాధించుకున్నాక వైద్యరంగంలో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు. వైద్య రంగంలో సమూల మార్పులతో ఈ రోజు ప్రైవేట్ కంటే ప్రభుత్వ దవాఖానల్లోనే ఎక్కువగా ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. గతంలో అరకొర వైద్య సిబ్బందితో సకాలంలో కనీస వైద్యం కూడా అందేది కాదని, ఎప్పుడు సీజనల్, కలరా వంటి విషజ్వరాలే, ఎకడచూసిన అపరిశుభ్రమైన వా తావరణమే కనిపించేదన్నారు. 2010లో డెం గ్యూ వ్యాధితో బాధపడుతూ మన కండ్ల ముందే ఎన్నో మరణాలు సంభవించాయన్నారు.
నాడు ఉన్నత వర్గాలకు మాత్రమే సాధ్యమయ్యే వైద్య విద్యను నేడు సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థుల కలను నేరవెరస్తూ తెలంగాణలోని ప్రతి జిల్లాలో సీఎం కేసీఆర్ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. ప్రస్తు తం ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వైద్యంతో పాటు కేసీఆర్ కిట్లతో ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. తెలంగాణలోనే ప్రప్రథమంగా ల్యాక్టిషియన్ సెంటర్ను కరీంనగర్లో ప్రారంభించుకున్నామని చెప్పారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని, కానీ అలా పాలు పట్టించలేని స్థితిలో ఉన్న బాలింతల కోరకు ఈ కేంద్రాన్ని ప్రభుత్వ దవాఖానాలో ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. పుట్టిన బిడ్డగురించి ఎవరైనా ఆలోచిస్తారని, కానీ ఆ బిడ్డ కడుపులో ఉండగానే సం పూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆలోచించి, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గర్భిణులకు న్యూట్రిషియన్ కిట్లను అందిస్తూ పర్ క్యాపిటా దిశగా వైద్యాన్ని అభివృద్ధి చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తె లంగాణ మాత్రమేనని ఉద్ఘాటించారు. 2020 లో యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా, కరీంనగర్లో ఒకసారే 10 కరోనా కేసులు రావడంతో ప్రజలంతా భయబ్రాంతులకు గురయ్యారని, అలాంటి పరిస్థితిలో పోలీస్, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడారన్నారు. ఎంతటి విపతర పరిస్థితులు ఎదురైనా వైద్య సిబ్బంది తమ కుంటుంబాలను వదిలి ప్రజల కోసం కృషిచేసిన ఆశ, ఏఎన్ఎం, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
వైద్య సిబ్బంది కృషితో తెలంగాణ ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా అడుగులేస్తోందని, మిషన్ భగీరథతో శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను అందించారు. అనంతరం వైద్య సిబ్బందితో కలిసి భోజనం చేశారు. వైద్య సేవలందించిన ప్రభుత్వ దవాఖాన వైద్యులు మంజుల, సాయిని నరేందర్, ఫార్మసిస్టు రాజమౌళి, మిడ్ వైఫరి రమ్యశ్రీ, ల్యాబ్ టెక్నీషియన్ ఉమారాణిలను ఘనంగా సన్మానించారు. ఆశలకు చీరలు, ఏఎన్ఎంలకు, బీపీ ఆపరేటర్లను అందజేశారు. ఇక్కడ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మదు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనీల్, కొత్తపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, డీఎంహెచ్ఓ లలితాదేవి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా, దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శీల లక్ష్మీనారాయణ, ఆర్ఎంఓ డాక్టర్ జ్యోతి, అదనపు ఆర్ఎంఓ డాక్టర్ నవీనా, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన ప్రాంగణంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో కాంప్రెన్సివ్ లాక్టాషన్ మేనేజ్మెంట్ సెంటర్, 20 మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కలెక్టర్, నగర మేయర్తో కలిసి మంత్రి ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేక్ను కట్ చేశారు. కేసీఆర్ కిట్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. త్వర లో కాంపెన్సీవ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. కాంపెన్సీ వ్ లాక్టేషన్ మిషన్ను ప్రారంభిస్తే ఒక తల్లి ఇచ్చిన పాలను ఎంతమంది శిశువులకై నా పట్టించవచ్చన్నారు. వందకు 90 శాతం మం ది తల్లులు తమ పిల్లలకు పాలు సమృద్ధిగా వస్తాయని, పది శాతం మందికి మాత్రమే రావని, ఇవి అలాంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
దేశంలోనే తొలిసారిగా న్యూట్రిషన్ కిట్లు
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే ప్రప్రథమంగా రా ష్ట్రంలో ప్రవేశపెట్టిన గొప్ప పథకం న్యూట్రిషన్ కిట్. కడుపులో ఉన్న బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టాలని, అమ్మ కాబోతున్న ప్రతి మహిళ రక్తహీనతను అరికట్టడానికి హా ర్లిక్స్, ఐరన్, సిరప్, ఖర్జూరం, నెయ్యి, పల్లి చికి వంటి బలవర్ధకమైన పోషకాహారాలతో పాటు హర్లిక్స్ తాగడానికి కప్పు, వస్తువులను అమర్చుకోవడానికి బాక్స్తో మొ త్తం రూ.3వేల విలువైన న్యూట్రిషన్ కిట్లను అందిస్తున్నాం. ఎకడైనా పుట్టిన బిడ్డల కో సం పథకాలను ఆయా రాష్ట్రాలు ప్రవేశపెడి తే, మన రాష్ట్రంలో మాత్రం పుట్టబోయే బిడ్డ కోసం తెచ్చిన పథకం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్.
– మంత్రి గంగుల కమలాకర్
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలు
కేరళ, తమిళనాడులో ప్రైమరీ, సెంకడరీ తదితర ఆరోగ్య సేవల పై కొన్నేళ్లుగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తే, కేవలం తొమ్మిదేండ్లలోనే తెలంగాణ వైద్య పరంగా అంతకు మించిన విజయాన్ని సాధించింది. ఆరోగ్యప్రగతిలో భాగంగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రెండు ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉండగా, మరో ప్రభుత్వ వైద్య కళాశాలను ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఐటీడీఏలో పనిచేసిన రోజు ల్లో ప్రసవాలకు నాటు పద్ధతులు పాటించినవారు, ఇ ప్పుడు ప్రసవాలకు దవాఖానలకు వస్తున్నారు. ఇం దుకు విశేషంగా కృషిచేస్తున్న వైద్య సిబ్బందికి, ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా, ఏఎన్ఎంలకు ధన్యావాదాలు.
– ఆర్వీ కర్ణన్, కలెక్టర్