NTPC | జ్యోతినగర్, సెప్టెంబర్ 18 : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న అతిపెద్ద 25వ ఎనర్జీ ఎఫిషియాన్సీ సమావేశంలో ఇంధన నిర్వహణలో ప్రతిభ కనబరిచిన కంపెనీలలో ఎన్టీపీసీ దాద్రి ప్రాజెక్టు సీనియర్ మేనేజర్ మునగ వంశీకృష్ణ సీఐఐ యంగ్ అండ్ ఎమర్జింగ్ లీడర్ 2026కు విన్నర్ గా ఎంపికయ్యారు. ఇంధన సామర్థ్యంపై దేశవ్యాప్తంగా 120కి పైగా ప్రముఖ ఇంధన సంస్థలు పాల్గొన్న ఈ సదస్సులో వంశీకృష్ణ తన ప్రతిభ, వృత్తి నైపుణ్యత, నాయకత్వ లక్షణాలతో వంశీకృష్ణకు ప్రతిష్టాత్మకమైన ఏకైక గుర్తింపు పురస్కారం లభించింది.
ఈ మేరకు శుక్రవారం జరిగిన ఎనర్జీ ఎఫిషియన్సీ ముగింపు కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బదిలీపై దాద్రి ప్రాజెక్టుకు వెళ్లిన వంశీకృష్ణ రెండు, మూడు నెలల క్రితం స్థానికంగా రామగుండం ఎన్టీపీసీలో ఎనర్జీ ఎఫిషియాన్సీ మేనేజ్మెంట్ గ్రూప్ కు సీనియర్ మేనేజర్ తో స్థానికంగా రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగులు హర్షం చేశారు.