Electricity Employees | ముకరంపుర, అగస్టు 11 : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు లో ప్రైవేట్ జోక్యం వద్దంటూ కరీంనగర్ లో విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న నిరసన మంగళవారం నాటికి 28వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం వ్యవహారిస్తున్న విధానాలను తప్పుబడుతూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు.
ప్రైవేటీకరణ వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. తమ నిరసనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణారావు, మహేందర్ రావు, శ్రీనివాస్, రమేష్, సంతోష్, నిఖిల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.