ఎలిగేడు, ఫిబ్రవరి 20: ఇటీవల ఎలిగేడు పీహెచ్సీతోపాటు సుల్తాన్పూర్, ధూళికట్ట సబ్సెంటర్లకు ‘కాయకల్ప’కు ఎంపిక కాగా, మంగళవారం జాతీయ వైద్య బృందం సభ్యులు ఆయా దవాఖానలను పరిశీలించారు. ఈ హాస్పిటళ్ల నిర్వహణ, ప్రజలకు అందుతున్న వైద్యం, రికార్డులను పరిశీలించారు.
ఎలిగేడు పీహెచ్సీలో వైద్యురాలు నిస్సీక్రిస్టినా, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి రాజేశ్వరీదేవి, వైద్యారోగ్య సిబ్బందిని అభినందించారు. మెరుగైన వైద్యం అందించేందుకు మరిన్ని సూచనలు సలహాలను చేశారు. ఇక్కడ బృందం వైద్యులు పల్లవి, అన్నారావు, కృతిమాన్ మహంతతోపాటు హెల్త్సబ్ సెంటర్ల వైద్యసిబ్బంది ఉన్నారు.