విద్యానగర్, మార్చి 23: లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఉదార నేత్ర దవాఖాన సేవలకు అరుదైన గుర్తింపు దక్కింది. అక్టోబర్ నెలలో ఒకే రోజు 124 కంటి ఆపరేషన్లు చేసినందుకుగాను, కంటి దవాఖాన పేరు వండర్ బుక్ అఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ సర్టిఫికెట్ను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాస్పిటల్ చైర్మన్ కొండ వేణు మూర్తి, వైస్ చైర్మన్ చిదుర సురేశ్కు గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా హాస్పిటల్లో అందుతున్న సేవలను అభినందించారు. త్వరలోనే దవాఖానను సందర్శిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ పట్టణాధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు. చైర్మన్ కొండ వేణు మూర్తి మాట్లాడుతూ దవాఖాన సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. హాస్పిటల్లో లభిస్తున్న రెటినా, గ్లకొమా తదితర సేవలను వినియోగించుకోవాలని కోరారు.