కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 7 : ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంటర్ తర్వాత ఏం చదవాలి? ఎలాంటి కోర్సులు చేయాలి? ఏ కాలేజీని ఎంచుకోవాలి? ఇలా అనేక అంశాలపై చాలా మంది విద్యార్థులకు స్పష్టత ఉండదు. పిల్లలకే కాదు, తల్లిదండ్రులకూ సరైన అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలోనే కొత్తపల్లి అల్ఫోర్స్ కళాశాలలో ‘నమస్తే తెలంగాణ’ , కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘లక్ష్యం-2023’ కార్యక్రమం పేరిట ఇంటర్ విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటర్ తర్వాత చేయాల్సిన కోర్సులు, కాలేజీల ఎంపిక ఇలా ఎన్నో విషయాలపై దిశానిర్దేశం చేశారు.
డ్యూయల్ డిగ్రీతో అద్భుత అవకాశాలున్నాయని, తమ యూనివర్సిటీలో ఈ డిగ్రీ చేసే అవకాశమున్నదని కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ (అడ్మిషన్స్) జే శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ స్థాయిలో విద్యాబోధన అందిస్తున్నామని, వాటిల్లో చదివిన విద్యార్థులతో సమానంగా ఉద్యోగాల్లో వేతనాలు ఇప్పించే స్థాయిలో తమ యూనివర్సిటీ నిలుస్తున్నదని చెప్పారు. కొత్తపల్లి అల్ఫోర్స్ విద్యాసంస్థలలో ‘నమస్తే తెలంగాణ’, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘లక్ష్యం-2023’ కార్యక్రమం పేరిట ఇంటర్ విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి, నమస్తే తెలంగాణ ఉమ్మడి జిల్లా బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్రావు, అడ్వైర్టెజ్మెంట్ మేనేజర్ ఆర్ మల్లయ్యతో కలిసి డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. ఇంటర్ తర్వాత మంచి ఉద్యోగావకాశాల కోసం ఎలాంటి ఉన్నత చదువులు చదవాలి? ఎక్కడ చదవాలి? అనే సంకోచంలో చాలా మంది విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును చేతులారా వ్యర్థం చేసుకుంటున్నారని చెప్పారు.
అలాంటి విద్యార్థులు భవిష్యత్తు కోసం తమ కేఎల్ యూనివర్సిటీని ధీమాగా ఎంచుకోవచ్చని నిర్దేశం చేశారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదివినప్పుడే ఉజ్వల భవిష్యత్కు అడుగు పడుతుందని, ఉన్నతంగా స్థిరపడాలంటే అందుకు లక్ష్యం ఎంపిక కూడా అదే తరహాలో ఉండాలని, అలాంటి ఎంపికకు సరైన కేంద్రం కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ అని విద్యార్థులకు సూచించారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు విద్యాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకుని చదువుకునే అవకాశాలు ఉన్నాయని సూచించారు. ఇక్కడ ఒక కోర్సులో డిగ్రీ చదువుతూ, మరో రెండు కోర్సుల్లో డ్యూయల్ డిగ్రీ చేసే అవకాశముందన్నారు. తమ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారని, ఇప్పటి వరకు అత్యధికంగా 60 లక్షల జీతం తీసుకుంటున్నారని వివరించారు.
అలాగే, మా వద్ద రెండేళ్లు చదువుకున్న విద్యార్థి మిగతా చదువును ఇతర దేశాల్లో యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో పూర్తి చేసుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. లేదా మూడేళ్లు ఇక్కడ చదువుకున్న విద్యార్థి మరో ఏడాది విదేశాల్లో ఉన్న కళాశాలల్లో తమ చదువుకూడా పూర్తి చేసుకోవచ్చన్నారు. ఇది తమ యూనివర్సిటీకి మాత్రమే ఉన్న అవకాశం అని స్పష్టం చేశారు. అలాగే, ఇప్పుడు మార్కెట్లో ఉన్న కోర్సులకు అనుగుణంగా తమ యూనివర్సిటీలో సాఫ్ట్వేర్ రంగంలో రెండో సంవత్సరం నుంచే శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం జేఈఈ మెయిన్స్లో 95 శాతంపైన సాధించిన విద్యార్థులు మొట్టమొదట రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి నాలుగు సంవత్సరాల మెరిట్ స్కాలర్షిప్తో విద్య అందించాలని కేఎల్ యూనివర్సిటీ నిర్వాహకులను అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి కోరగా, డైరెక్టర్ శ్రీనివాసరావు అందుకు అంగీకరించారు. ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ రీజినల్ మేనేజర్లు కే రాజేశ్, రాజ్యలక్ష్మి, కరీంనగర్ ఇన్చార్జి నవీన్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం అడ్మిషన్ల కోసం ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాల కోసం 95503 44777, 79979 95708 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
ఇంటర్ తర్వాత ఏం చేయాలి? అనే సందేహం చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. అలాంటి సందేహాలను నివృత్తి చేస్తూ, తమ యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సులు, అవి విద్యార్థులకు ఉపయోగపడే తీరును కేఎల్ యూనివర్సిటీ వారు వివరించడం అభినందనీయం. మంచి విద్యాసంస్థల్లో చదివినప్పుడే మంచి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ప్రతి ఒక్కరూ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
– వీ నరేందర్ రెడ్డి, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్
కొత్త విషయాలు తెలిసినయ్
కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన సెమినార్ ద్వారా చాలా కొత్త విషయాలు తెలిసినయ్. ఇంటర్ తర్వాత ఏం చేయాలనే ఒక క్లారిటీ వచ్చింది. మంచి జాబ్ పొందాలంటే మంచి కాలేజీలో చదవాలి. ఇప్పుడున్న పరిస్థితులతో పోటీపడి చదివితే ఉన్నత లక్ష్యం చేరుకోవచ్చు.
– హన్సిక, ఎంపీసీ ఫస్టియర్
విద్యాలక్ష్మి పోర్టల్ గురించి తెలిసింది
ప్రైవేట్ యూనివర్సిటీలో చదివితే విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా రుణ సదుపాయం పొందవచ్చని ఇప్పుడే తెలిసింది. ఉన్నత చదువులు చదువుకోవాలని ఉండి, ఆర్థిక స్థోమత లేని వారి కోసం ఈ పథకం చాలా ఉపయోగ పడుతుంది. అలాగే, మంచి ఉద్యోగావకాశాలపై నాకున్న డౌట్స్ క్లారిఫై అయినయ్. ఈ సెమినార్ నాలాంటి వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్తుకు ఇదొక మార్గం.
– శ్రీధరణి, ఎంపీసీ సెకండియర్
ఒక అవగాహన వచ్చింది..
నమస్తే తెలంగాణ, కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన సెమినార్ ద్వారా ఇంటర్ తర్వాత ఏం చేయాలనే ఒక అవగాహన వచ్చింది. ఉన్నత లక్ష్యం వైపు అడుగేసేందుకు ఏం చదవాలి? ఎలా చదవాలి? ఎలాంటి కాలేజీలను ఎంచుకోవాలో తెలిసింది. భవిష్యత్తుపై ప్రతి ఒక విద్యార్థికీ అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. చాలా సంతోషంగా ఉంది.
– కీర్తన, ఎంపీసీ సెకండియర్