విద్యానగర్, డిసెంబర్ 27: వినియోగదారులను ఆకర్షించి డిపాజిట్లను పెంచే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో ‘సహకార క్రాంతి’ పథకాన్ని ప్రారంభించామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. సాధారణ ఖాతాదారులు, సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచామని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్లోని కేడీసీసీబీ కార్యాలయంలో వైస్ చైర్మన్ పీ రమేశ్, సీఈవో ఎన్ సత్యనారాయణ, బోర్డు డైరెక్టర్లతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 18 నెలలు (546 రోజులు)కు ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ అందిస్తామని వివరించారు. ఇక్కడ బ్యాంక్ డైరెక్టర్లు ముప్పాల రాంచందర్రావు, వీ మోహన్రెడ్డి, సింగిరెడ్డి స్వామి రెడ్డి, కమలాకర్, మోహన్రావు, గోపాల్రావు, శ్రీనివాస్, రవీందర్గౌడ్, నరేశ్ రెడ్డి, నాబార్డు డీడీఎం మనోహర్ రెడ్డి, టీఎస్ సీఏబీ ప్రత్యేక ఆహ్వానితులు శ్రీనివాస్రావు, సీఏ రమేశ్ ఉన్నారు.