పెద్దపల్లి, జూలై 15(నమస్తే తెలంగాణ): అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాను అ భివృద్ధిలో మరింత అగ్రస్థానంలో నిలిపి ఆదర్శం గా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోటీ పడి పనిచేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా పెద్దపల్లి కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ తెలంగాణ ఫుడ్స్ ఎం డీగా బదిలీ కాగా, ఆమె స్థానంలో సిద్దిపేట జిల్లాలో స్థా నిక సంస్థల అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముజమ్మిల్ ఖాన్ ఉద్యోగోన్నతిపై వచ్చారు. శనివారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కలెక్ట ర్ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముజమ్మిల్ ఖాన్ మాట్లాడారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేస్తామని వివరించారు. మూడున్నరేండ్లపాటు సిద్ధిపేట జిల్లా అ దనపు కలెక్టర్గా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి జిల్లా ప్రాధామ్యాలను తెలుసుకొని ముం దుకు సాగుతామన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పెద్దపల్లి జి ల్లాపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని ముందుకు సాగుతామని వివరించారు. బాధ్యత లు స్వీకరించిన కలెక్టర్ను అదనపు కలెక్టర్ వడ్ల లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. తన వెంట వచ్చిన సిద్దిపేట కలెక్టరేట్ సహాయకులతో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్ట్ ఎదుట ఫొటోలు దిగారు. అం తకుముందు ముజమ్మిల్ఖాన్ తన సతీమణి ఐఎఫ్ఎస్ అధికారి హమ్నామారియంఖాన్తో కలిసి క లెక్టర్ నివాసంలో సర్వే సంగీత సత్యనారాయణను కలిశారు ముజమ్మిల్ఖాన్కు పలువురు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.