పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎం.డీ.మహబూబ్ పల్లకి అందజేశారు. ఆలయంలో స్వామి వారి సేవకు ఉపయోగించేందుకుగాను ఆలయ కమిటీ అధ్యక్షుడు భూమాడి గంగరెడ్డి, ప్రధాన కార్యదర్శి చాట్ల ప్రశాంత్, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో మహబూబ్ పల్లకీని అందించారు. ఈసందర్భంగా మహబూబ్ ను ఆలయ కమిటీ సభ్యులు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.
వినాయక చవితి ఉత్సవాల సమయంలోనూ మహబూబ్ వినాయకుడి శోభాయాత్రకు ప్రత్యేక వాహనం తయారు చేసి అందించాడు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాటం నర్సింహరెడ్డి, తోడేటి లోకేష్, గంగుల కొమురెల్లి, మాసూరి పార్థసారధి, కామాద్రి అరుణ్, ఉప్పు రవి, తోట రాజు, కొత్త తిరుపతి, పర్శరాం, కొత్తూరి బాబు, రమేశ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.