కొడిమ్యాల, నవంబర్ 1: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మాయపల్లి, కొడిమ్యాల, తిప్పాయిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సౌకర్యం కోసమే ప్రభుత్వం ఏటా గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నదని చెప్పారు. నిర్ణీత ప్రమాణాలతో నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తరలించి, మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, సింగిల్ విండో చైర్మన్లు మేన్నేని రాజనర్సింగరావు, పోలు రాజేందర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ నరేందర్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ అంకం రాజేశం, సర్పంచులు మ్యాకల లత, ఏలేటి మమత, ఏగుర్ల తిరుపతి, గరిగంటి మల్లేశం, మల్యాల మహిపాల్, ఉప సర్పంచ్ కామునీ శ్రీనివాస్, ఏపీఎం దేవరాజం, నాయకులు మ్యాకల మల్లేశం, ల్యాగల రాజేశం, బొడ్డు రమేశ్, నేరెళ్ల మహేశ్, కాయిత రాజు, గట్ల మల్లారెడ్డి, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.