కార్పొరేషన్, మార్చి 3 : ప్రజల అభ్యున్నతి, అభివృద్ధి కోసం నిత్యం తపించే నాయకుడు మాజీ ఎంపీ వినోద్కుమార్ అని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కొనియాడారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి పదహారేళ్లు అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రూపొందించిన వీడియోను ఆదివారం కరీంనగర్లోని వినోద్కుమార్ క్యాంపు కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవీఆర్ మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత కేసీఆర్తో కలిసి వినోద్కుమార్ వెన్నంటి ఉండి పోరాటం చేశారని, ఎంపీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు.
అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఉద్యమ కెరటం అని ప్రశంసించారు. కరీంనగర్ ఎంపీగా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారని, వెయ్యి కోట్లతో స్మార్ట్సీటీని తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. 2019లో ఓడిపోయినా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జక్కుల నాగరాజు, ద్యావ మధుసూదన్రెడ్డి, దూలం సంపత్గౌడ్, వంశీధర్రెడ్డి, సాయికృష్ణ, ఓంకార్, శ్రీను, శ్రావణ్, రాజశేఖర్, అజయ్, రమేశ్, విజేందర్రెడ్డి, సతీశ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.