ధర్మపురి/ ధర్మారం, మే 26: తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకోగా, ఈ సందర్భంగా మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోగా, వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ ఈవో వరసిద్ధి వినాయక స్వామి శేష వస్త్రంతో మంత్రిని సతరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు.