హుజూరాబాద్టౌన్, జూన్ 8: సమైక్య పాలనలో సాగునీటి కొరతతో ఆగమైన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చిన ఘనత అపరభగీరథుడు, సీఎం కేసీఆర్దేనని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రా ష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుజూరాబాద్లో గురువారం నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమానికి ఆయన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో కలిసి హాజరయ్యారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం నుంచి మహిళలతో కలిసి బతుకమ్మలు, బోనాలతో ర్యాలీగా గుండ్ల చెరువుకట్ట వద్దకు తరలి వచ్చారు. చెరువు తూము వద్ద ప్రత్యేక పూజలు చేసి చీర, సారెను గంగమ్మ తల్లికి సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో 32,969 వ్యవసాయ మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు.
రైతులు పండించిన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తున్నట్లు చెప్పారు. కొత్త వ్యవసాయ మారెట్ల ఏ ర్పాటు, గోదాంల నిర్మాణం, మారెటింగ్ యార్డుల్లో రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను ప్రజలంతా ఆశీర్వదిస్తే బంగారు తెలంగాణ సాధించడం ఖాయమని అన్నారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడారు. కా గా, మహిళలు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల-శ్రీనివాస్, మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్, నీటిపారుదల శాఖ అధికారి రాము, కమిషనర్ సల్వాది సమ్మయ్య, ఏఈ సాంబరాజు, టీపీవో జ్యోష్ణాదేవి, టీపీఎస్ అశ్వినిగాంధీ, హెల్త్ అసిస్టెంట్ కిషన్రావు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.