జమ్మికుంట, జనవరి 24: జమ్మికుంటకు ఈనెల 31న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వస్తున్నారని, పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 50 వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తెలిపారు. సీపీ సత్యనారాయణతో కలిసి మంగళవారం ఆయన జమ్మికుంటకు వచ్చారు. సభ కోసం గ్రౌండ్, పార్కింగ్, రూట్మ్యాప్, తదితర ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కమలాపూర్ నుంచి ర్యాలీగా జమ్మికుంటకు చేరుకుంటారని, మైదానంలో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారని పేర్కొన్నారు. సభకు నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సభకు హాజరయ్యే వారితో పాటు సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. అనంతరం ఆబాది జమ్మికుంటలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామని సీపీ సత్యనారాయణ చెప్పారు. జిల్లాలోని అధికారులతో కలిసి రూట్మ్యాప్ రూపొందించామని, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. సభ, పార్కింగ్, రాకపోకలు అధికారులు, సిబ్బంది పర్యవేక్షిస్తారని చెప్పారు. ముందుగా మంత్రి కమలాపూర్కు వస్తారని, అక్కడి నుంచి ర్యాలీగా జమ్మికుంటకు చేరుకుంటారని తెలిపారు. సభ పూర్తికాగానే హుజూరాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకుంటారని పేర్కొన్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్, హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి, జమ్మికుంట, హుజూరాబాద్ రూరల్ సీఐలు సురేశ్, జనార్దన్, ఎస్ఐలు యూనస్ అహ్మద్, తిరుపతి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.