ఇల్లందకుంట డిసెంబర్ 11: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఇల్లందకుంట రైతు వేదికలో ఆదివారం 72 మందికి రూ. 72,8,352 కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. జడ్పీచైర్పర్సన్ కనుమల్ల విజయ, తహసీల్దార్ మాధవితో కలిసి ఎమ్మెల్సీ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో పదివేల మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశామన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.లక్షా116ను సీఎం కేసీఆర్ అందిస్తున్నట్లు చెప్పారు.
రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్, సాగునీటి సరఫరా, పెన్షన్లులతో పాటు తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే, కేంద్ర ప్రభుత్వం మోటర్లకు మీట ర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. మండలంలోని 18 గ్రామాల్లో మహిళ సంఘాల భవనాలను త్వరలోనే నిర్మిస్తామని, ప్రతి గ్రామంలో సొంత స్ధలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలను అందిస్తామని వివరించారు. ఎమ్మెల్యేగా గెలించిన ఈటల రాజేందర్ కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి రాకుండా శుభకార్యక్రమాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ పధకాలను పరిగెరుకునే పథకాలన్న ఈటల కేంద్రం నుంచి ఏం పథకాలు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నిరుపేదలను పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వంలో దళారుల ప్ర మేయం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయని, దేశానికి సీ ఎం కేసీఆర్ పాలన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇక్కడ సర్పంచులు మొగిళి, రాజు, దిలీప్రెడ్డి, రఫీఖాన్, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరె డ్డి, అయిలయ్య, డీటీ వరలక్ష్మి, ఆర్ఐ రవి, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, కుమార్, రాకేశ్, నగేశ్తోపాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.