గోదావరిఖని, జూన్ 5: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికులకు ఇంక్రిమెంట్లతో పాటు చిరకాల వాం చ అయిన డిపెండెంట్ ఉద్యోగాలను సైతం సాధించుకున్నామన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా అనేక వ్యక్తులు, శక్తులు అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ కార్మికుల మంచి కోరే వ్యక్తిగా కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా ప్రతి నెలా ఉద్యోగాలు ఇస్తున్నారని, ఇప్పటిదాకా దాదాపు 15వేల కారుణ్య ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. కారుణ్య ఉద్యోగాలు కేవలం పురుషులకే కాకుండా కూతుర్లు, కోడళ్లకు సైతం అవకాశం ఇవ్వడం ద్వారా మహిళలపై సీఎం కేసీఆర్కు ఉన్న గొప్ప మనసును తెలియజేస్తోందన్నారు. కారుణ్య ఉద్యోగం వద్దనుకున్న వారికి గతంలో ఇస్తున్న రూ.10లక్షలను తెలంగాణ వచ్చాక రూ.25లక్షలకు పెంచామని గుర్తు చేశారు.
ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుకోవడం సంతోషకరమన్నారు. కార్మికులకు సౌకర్యవంతంగా పని చేయాలనే ఉద్దేశంతో సింగరేణి క్వార్టర్లకు ఉచిత విద్యుత్తోపాటు ఏసీ వసతి కల్పించడం, ఇంటికి రూ.10లక్షల దాకా వడ్డీలేని రుణాన్ని ఇవ్వ డం, మహిళా కార్మికులకు చైల్డ్ కేర్ లీవ్, దివ్యాంగులకు ఉద్యోగాలు, సింగరేణి దవాఖానల్లో కార్మికుల తల్లిదండ్రులకు ఉచిత వైద్య సదుపాయం, విరమణ తర్వాత కూ డా వైద్య సదుపాయాలు అందించడం, సింగరేణి కార్మికుల పిల్లల ఐఐటీ, ఐఐఎం లాంటి చదువులకు ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వడం, సింగరేణి కార్మికుల కోసం మెడికల్ కాలేజీ లాంటి అనేక గొప్ప కార్యక్రమా లు తెలంగాణ వచ్చాక సాధించుకున్నామని తెలిపారు. కార్మికులకు అంబేద్కర్ జయంతి రోజున వేతనంతో కూడిన అధికారిక సెలవుగా ప్రకటించి సీఎం కేసీఆర్కు అంబేద్కర్పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారని కొనియాడారు. అమ్మలాంటి సింగరేణి సంస్థను కాపాడి, విస్తరించి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం, సంస్థను లాభాల బాట పట్టించడం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే సాధ్యమయ్యాయని గర్వంగా చెబుతున్నానని పేర్కొన్నారు.