రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు గానూ 11 మంది హాజరయ్యారు. ఇందులో బీఆర్ఎస్ నుంచి కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఎన్నికైన గంగుల కమలాకర్, డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, కాంగ్రెస్ నుంచి మంథని, హుస్నాబాద్, మానకొండూర్, చొప్పదండి, వేములవాడ, పెద్దపల్లి, రామగుండం.
ధర్మపురి నియోజకవర్గాల్లో ఎన్నికైన దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు.
రామగుండం ఎమ్మెల్యే సింగరేణి కార్మికుడిగా దుస్తులు ధరించి, తలకు హెల్మెట్, తట్టా చెమ్మస్తో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, సిరిసిల్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన కేటీఆర్, పాడి కౌశిక్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయలేదు.
– కరీంనగర్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి)