కోహెడ, నవంబర్ 19: మండలాన్ని అభివృ ద్ధి చేశానని, ఆశీర్వదించి మరోమారు గెలిపించాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ అన్నారు. ఆదివారం మ ండలంలోని సముద్రాల, నాగసముద్రాల, బత్తులవానిపల్లి, బస్వాపూర్, ఆరెపల్లి, పోరెడ్డిపల్లి, గుండారెడ్డిపల్లి గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధు లు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే సతీశ్కుమార్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, మహిళా స్వశక్తి భవనాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గ్రామపంచాయతీ భవనాలు, సీఎంఆర్ఎఫ్ చె క్కులు, ఆసరా, తదితర పథకాలు ప్రతి గ్రామానికి, ఇంటింటికీ అందించానన్నారు.
మోయతుమ్మెద, ఎల్లమ్మ వాగులలో చెక్ డ్యాంలను ని ర్మించి సాగునీటి కొరత లేకుండా చూశానన్నారు. కోహెడ మండలం సాగునీటితో సస్యశ్యామలం గా మారిందన్నారు. పలు గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచారంలో ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, ప్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్రావు, పార్టీ మండలాధ్యక్షుడు ఆవుల మహేందర్, జిల్లా నాయకులు నాగరా జు, మధుసూదన్రావు, కొక్కుల సురేశ్, కర్ర ర వీందర్, తిప్పారపు శ్రీకాంత్, పిల్లి మాధవి, పూ లవిజయ, కన్నం లక్ష్మి, రాజు, కొడముంజ మ ల్లవ్వ, బానోతు సరోజన, ఎడబోయిన సత్తయ్య, తిరుపతిరెడ్డి, కనకయ్య, అశోక్రెడ్డి, జాలిగాం శంకర్, తిప్పారపు నాగరాజు పాల్గొన్నారు.