ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
వర్షకొండలో పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
ఇబ్రహీంపట్నం, జూన్ 19 : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొనియాడారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని పేదోళ్లు పెద్దోళ్లు కావాలని ఆకాంక్షించారు. నియోజక వర్గ అభివృద్ధికి ఎళ్లవేళలా కృషి చేస్తున్నానని, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ బోనాల పండుగ, జాతర ఉత్సవాలకు హాజరయ్యారు. పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకులు ఎమ్మెల్యేకు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన సంగర్తి గంగారాంకు దళితబంధు ట్రాక్టర్ను ఎమ్మెల్యే అందజేసి, మాట్లాడారు.
ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని తెచ్చారని, ఈ పథకం ఎన్నో కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నదని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఎంతో మంది నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. దళితుల బతుకుల్లో వెలుగు నింపేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా దళితబంధు పథకాన్ని తెచ్చి అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే ఈ పథకంతో ఎంతో మంది ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి, సర్పంచ్ దొంతుల శ్యామల, వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పోన్కంటి వెంకట్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎలాల ధశరథ రెడ్డి, ఉప సర్పంచ్ మంగిలిపెల్లి లక్ష్మణ్, నాయకులు తుకారాం, చిన్న రాజన్న, మామిడి చిన్నారెడ్డి, నేమూరి సత్యనారాయణ, కంఠం రమేశ్, ఎలేటి చిన్నారెడ్డి, జాజాల జగన్ రావు, సల్ల దేవదాస్, తోకల శేఖర్, సౌతం గణేశ్, నర్సయ్య, నాగన్న, అనిల్, ధశరథం, తదితరులు పాల్గొన్నారు.