చొప్పదండి, జూలై 11: చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎంను కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. అందుకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే వెల్లడించారు.
చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని, అలాగే, ల్యాండ్ అక్వేషన్ (ఎల్ఏ) నిధులను త్వరగా విడుదల చేయాలని, ఎల్లంపల్లి ప్యాకేజీ 1, 3 పెండింగ్ పనులు, పోతారం రిజర్వాయర్ డీఎల్ఆర్, ఎస్ఎల్ ఆర్ బ్రిడ్జిలు, డీ1, డీ2 కాల్వలు, కాళేశ్వరం అదనపు టీఎంసీ కాలువకు భూసేకరణ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. నిధుల కేటాయింపునకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.