చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
న్యాలకొండన్నపల్లిలో రైతు బీమా ప్రొసీడింగ్ అందజేత
గంగాధర, జూలై 4: సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన రైతు బీమా అన్నదాతల కుటుంబాలకు భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని కొండన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధి న్యాలకొండన్నపల్లికి చెందిన రైతు పిట్టల రాజయ్య ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం మంజూరైంది. ఈ మేరకు రైతుబీమా ప్రొసీడింగ్ పత్రాలను సోమవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాజయ్య ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పట్టాదారు పాస్తు పుస్తకం ఉన్న ప్రతి రైతు పేరు మీద ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు.
దురదృష్టవశాత్తు ఏ కారణం చేతనైన రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతుందన్నారు. బీమా ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యేకు సత్తయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు పుల్కం నర్సయ్య, ఉప్పుల గంగాధర్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఆత్మ చైర్మన్ తూము మల్లారెడ్డి, సర్పంచులు రేండ్ల జమున, వేముల దామోదర్, రాసూరి మల్లేశం, జోగు లక్ష్మీరాజం, ఉపసర్పంచ్ నిమ్మనవేణి ప్రభాకర్, నాయకులు రేండ్ల శ్రీనివాస్, వేముల అంజి, రామిడి సురేందర్, బొల్లాడి శ్రీనివాస్రెడ్డి, ఆకుల మధుసూదన్, వడ్లూరి ఆదిమల్లు, తాళ్ల సురేశ్, సముద్రాల అజయ్, సుంకె అనిల్, ఇరుగురాల రవి, మామిడిపెల్లి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.