ఒక కళాకారుడిగా ఈ జిల్లాకు వచ్చిన తనను ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమాభిమానాన్ని చూపించి అక్కున చేర్చుకున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తనపైన కాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలపై చాలా విష ప్రచారాలు జరిగాయని, ఎందరు ఎన్ని విధాలుగా మాట్లాడినా తమ పార్టీ అధినేత అనేక సమీక్షలు, పరిశీలనల తర్వాతనే తిరిగి అభ్యర్థులను ప్రకటించారని తెలిపారు.
తన నియోజకవర్గ ప్రజలు కూడా ఇంత కంటే మంచిగ పనిచేసేవారు లేరని, తననే మరోసారి పోటీ చేయాలని ఆశీర్వదిస్తున్నారన్నారు. కేసీఆర్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరోసారి విజయం సాధిస్తామని స్పష్టం చేశారు.