ఇల్లంతకుంట, మే 24: ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని వల్లంపట్ల, కిష్టారావు పల్లి గ్రామాల్లో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల ను ఎమ్మెల్యే అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వ కట్నంగా రూ. లక్షా116లు అందజేసి ఆ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
వల్లంపట్ల గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనాన్ని ప్రారంభించి పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం నా యకులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించా రు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రోండ్ల తిరుపతి రెడ్డి, సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ, ఎంపీటీసీ నాయిని స్రవంతి, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.