మానకొండూర్ రూరల్, మార్చి 2: కేంద్రంలోని బీజేపీ సర్కారు పేదల కడుపు కొడుతూ ఉన్నోళ్ల కడుపు నింపుతున్నదని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరల పెంచడంపై గురువారం మానకొండూర్ మండల కేంద్రంలోని పల్లె మీద బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రోడ్డు పకన కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ధరలు తగ్గించకుంటే, మోదీ గద్దె దిగక తప్పదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దసానని సులోచన-శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు ఉండింటి సులోచన, పిట్టల కవిత-మధు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్ రెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ నల్ల గోవింద రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పంజాల శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ ఏఎంసీ మాజీ చైర్పర్సన్ అనిత, తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, సీనియర్ నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మండల బీఆర్ఎస్ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, మహిళలు పాల్గొన్నారు.
శంకరపట్నంలో..
శంకరపట్నం, మార్చి 2: గ్యాస్ ధరలను అమాంతం పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపిన కేంద్రంలోని బీజేపీ ప్రభుతానికి మహిళలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడంపై ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు గురువారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, బీజేపీ సర్కారు మహిళల కష్టాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పులికోట రమేశ్, ఏఎంసీ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, ఎంపీటీసీ తిరుపతయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, సర్పంచులు రాజయ్య, కిషన్రావు, భద్రయ్య, రంజిత్రావు, సంపత్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, సంపత్, ప్యాక్స్ చైర్మన్ తిరుపతిరెడ్డి, కొత్తగట్టు ఆలయ చైర్మన్ మలహల్రావు, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉమ్మెంతల సతీశ్రెడ్డి, మోత్కూరి సమ్మయ్య, కొత్తపల్లి రవి, మేకల కుమార్, బొజ్జ రవి, బొజ్జ సుధాకర్, బుద్దార్థి సంపత్, అలీమొద్దీన్, పార్థసారథి, మన్సూర్, తిరుపతి, రాజు, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కొండపల్కలలో..
మానకొండూర్ రూరల్, మార్చి 2: వంట గ్యాస్ ధరల పెంపుపై కొండపలల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షులు బొంగొని రేణుక, గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి గౌడ్, సీనియర్ నాయకుడు కడారి రమేశ్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు దాసరి రాజుకుమార్, నాయకులు మెంగాని శ్రీనివాస్, విష్ణువర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గన్నేరువరంలో..
తిమ్మాపూర్ రూరల్, మార్చి 2: గన్నేరువరం మండల కేంద్రంలో గ్యాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మహిళలు, మహిళా నాయకులు రోడ్డుపై కట్టెల పొయ్యిలు పెట్టి ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి, మండలాధ్యక్షుడు గంప వెంకన్న, నాయకులు తీగల మోహన్రెడ్డి, గూడెల్లి ఆంజనేయులు, వైస్ఎంపీపీ న్యాత స్వప్నాసుధాకర్, కుసుంభ నవీన, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.