ఇల్లంతకుంట, నవంబర్ 1: ‘తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ హయాంలోనే ఎనలేని అభివృద్ధి జరిగింది. మళ్లీ విజయం మనదే. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తం’ అని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ 30 రోజులు తన కోసం పని చేయాలని, రాబోయే ఐదేండ్లు మీ కోసం మరింత చేస్తానని విజ్ఞప్తి చేశారు. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట గ్రామ పంచాయతీ ప రిధిలోని ఎన్నరుసుపల్లి గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారికి రసమయి వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఎన్నరుసుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇతర పార్టీల నాయకులు గూలాబీ గూటికి చేరుకోవడం సంతోషకరమన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని, తనను మరోసారి గెలిపించాలని కోరారు. తొమ్మిదిన్నర ఏండ్లల్లో ఎంతో అభివృద్ధి చేశానని.. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. తర్వాత రంగంపేట జీపీ పరిధిలోని మ్యాకోనిపల్లిలో ఓ శుభకార్యానికి హాజరై గ్రామస్తులను ఆప్యాయంగా పలుకరించారు. మరోసారి నువ్వే ఎమ్మెల్యే అవుతావం టూ.. ఓ వృద్ధురాలి దీవించగా రసమయి ఆపాయ్యంగా అక్కున చేర్చుకొని కృతజ్ఞతలు తెలిపా రు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి పాల్గొన్నారు.