మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 4: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, కేసీఆర్ పాలనలో సబ్బండవర్గాల్లో సంతోషం నెలకొన్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. రైతుల కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ తెచ్చిన రైతు బీమా దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని చెప్పారు. మంగళవారం ఆయన సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి మండల కేంద్రంతోపాటు ఖాదర్గూడెం, గంగిపల్లి, కొండపలల, ముంజంపల్లిలో పర్యటించారు. 16 మందికి కల్యాణలక్ష్మి, 32 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఇటీవల మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కొండపలలకు చెందిన జనగామ భాగ్యమ్మ అనే మహిళా రైతుతో పాటు బండి సంపత్ అనే మరో రైతు ఇటీవల మృతిచెందగా, వారికి రైతు బీమా కింద మంజూరైన రూ.5 లక్షల చొప్పున ప్రొసీడింగ్ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
కాగా, ఏ ఇంటికి వెళ్లినా ఎమ్మెల్యేకు ఆడబిడ్డలు ఆత్మీయ స్వాగతం పలికారు. నుదుట తిలకం దిద్దుతూ, చకెర కుడుకలు పోస్తూ, బట్టలు పెడుతూ ఆశీర్వదించారు. తనపై ఆడ బిడ్డలు చూపిన ప్రేమానురాగాలకు రసమయి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కొండపలలలో కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించి, వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ జడ్పీటీసీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచులు రొడ్డ పృథ్వీరాజ్, సాయవేని రాజు, నల్ల వంశీధర్ రెడ్డి, రామంచ గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ నెల్లి మురళి, తోట రాజమౌళి, మానకొండూర్ సొసైటీ ఉపాధ్యక్షుడు పంజాల శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్ వాల అజిత్ రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ వాల ప్రదీప్ రావు, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు బొంగోని రేణుక, ఎంపీటీసీలు నెలవేని శ్రీనివాస్, చలిగంగి సంపత్, రంగు భాస్కరాచారి, నాయకులు పిట్టల మధు, ఉండింటి శ్యాంసన్, నెల్లి శంకర్, సాగర్, కడారి ప్రభాకర్, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, నల్లగొండ తిరుపతి గౌడ్, జనగాం శంకర్, దాసరి రాజ్ కుమార్, కడారి రమేశ్, నందగిరి మల్లయ్య, గాజర్ల మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.