హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లోని పలు వార్డుల్లో శుక్రవారం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున కార్నర్ మీటింగ్లకు హాజరై మాట్లాడారు. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ను ప్రజలు మరోసారి నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓటు కోసం వస్తే హామీల అమలుపై నిలదీయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి భూపతిరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, కొండాల్రెడ్డి, అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.