మంత్రికి కోరుకంటి వినతి
గోదావరిఖని, జూలై 19 : గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు సుందిళ్ల నుంచి గోదావరిఖని వరకు కరకట్ట నిర్మించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విన్నవించారు. మంగళవారం హైదరాబాద్ ప్రగతిభవన్లో ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే కలిశారు.
ఇటీవల వరదల ఉధృతి కారణంగా న్యూ పోరట్పల్లి, మల్కాపూర్, సప్తగిరికాలనీ, జనగామ, తదితర ప్రాంతాలు నీట మునిగి జరిగిన నష్టాన్ని వివరించారు. ఈ పరిస్థితి పునరావృ తం కాకుండా ఉండేందుకు సుందిళ్ల నుంచి గోదావరిఖని వరకు 4 కిలోమీటర్ల మేర గోదావరినదికి రూ.100 కోట్ల అంచనా వ్యయంతో కరకట్ట నిర్మించాలని కోరారు. ఇందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు చందర్ తెలిపారు.