పాలకుర్తి, నవంబర్ 20: హస్తం గుర్తుకు ఓటేస్తే పల్లెల్లో కటిక చీకట్లు అలుముకుంటాయి రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు గ్యారెంటీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పొరపాటున గెలిపిస్తే మళ్లీ పాతరోజులు వస్తాయని హెచ్చరించారు. సోమవారం పాలకుర్తి మండలం రామారావుపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాదయాత్రల్లో పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, రైతులు, యువకులు యాత్రలో పాల్గొని కారుగుర్తుకు ఓటువేస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడారు. బీఆర్ఎస్ను ఆదరిస్తే రాబోయే రోజుల్లో ఆసరా పెన్షన్లు, రైతుబంధు నగదు పెంచుతామని చెప్పారు. రామగుండంలో అందుబాటులో ఉంటున్న తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు కౌశికహరి, గోపు అయిలయ్యయాదవ్, వైస్ఎంపీపీ ఎర్రంస్వామి, కార్పోరేటర్ కౌశికలత, సర్పంచ్లు మల్లేత్తుల శ్రీనివాస్, షేర్లలక్ష్మిపతి, ఎంపీటీసీ సంతపూరి ప్రియాంక, పార్టీ మండలాధ్యక్షుడు ఇంజపూరి నవీన్కుమార్, నాయకులు అల్లంరాజయ్య, చింతకింది సత్యనారాయణ, కొప్పు రాజేశం, మధన్మోహన్రావు, శంకర్, శ్రావణ్కుమార్, గుళ్లశ్యాం, నగేశ్, సమ్మయ్య, బుట్టిశ్రీకాంత్, గాజుల ప్రసాద్, కుమార్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని, నవంబర్ 20: తెలంగాణ ఉద్యమకారుడిగా 45 రోజుల పాటు జైలు జీవితం అనుభవించి 120 ఉద్యమ కేసులు ఉన్న మీ ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో గెలిచి రామగుండం నిరుపేదల ఆరోగ్యం కోసం మెడికల్ కళాశాలను ఏర్పా టు చేయించానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం స్థానిక కూరగాయల మార్కెట్లోని మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ గొప్ప పథకాలను అమ లు చేస్తున్నారన్నారు. 55 ఏళ్లు పాలించిన కాంగ్రె స్ పాలనలో ఆకలి చావులు ఆత్మహత్యలు తప్పా ఏమి కనిపించవన్నారు. సీఎం కేసీఆర్ 14 యేళ్ల పాటు తె లంగాణ ఉద్యమం కో సం పోరాడారని కేవ లం పదేళ్ల కాలంలోనే రాష్ట్రంను పచ్చని పం ట పొలాలతో సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటే సి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి, కమిటీ బాధ్యులు సంపత్, సంపత్ రెడ్డి, నాయకులు నూతి తిరుపతి, నీరటి శ్రీనివాస్, సత్యప్రసాద్, వీరాలాల్, పద్మక్క, జ్యోతి, పోచమ్మ ఉన్నారు.
జీడీకే-1 సీహెచ్పీలో కోరుకంటి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కటిక చీకటిలోకి నెట్టివేసిందన్నారు. సీఎం కేసీఆర్ కారుణ్య నియామకాల పేరుతో హక్కును పునరుద్ధరించడంతో దాదాపు సుమారు 20వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు దక్కాయన్నారు. సకల జనుల సమ్మెలో కార్మికుల వేతనాలలో కోత విధించవద్దని తాను అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు.
కాంగ్రెస్ సయాంలో జరిగిన అవినీతి కుం భకోణాలను సాకుగా చూపిన బీజేపీ ప్రభుత్వం ఎంఎండీఆర్ ఆక్ట్-2014ను ప్రవేశపెట్టి గనులను ప్రైవేట్పరం చేయడానికి చేపట్టిన వేలం పాటకు వ్యతిరేకంగా తాను నిరహార దీక్ష చేశానన్నారు. కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించి మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. ఇక్కడ నాయకులు కెంగర్ల మల్ల య్య, గంఢ్ర దామోదర్, జావిద్ పాషా, కనకం శ్యాంసన్, దాసరి శ్రీనివాస్, మల్లేశ్, శంకర్, మండ రమేశ్, మల్లారెడ్డి, పుట్ట రమేశ్, సాధన కుమార్, సుభాశ్, సదానందం పాల్గొన్నారు.