రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళు లర్పించి, మహోన్నత వ్యక్తి అని సేవలను కొనియాడారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో బాబా సాహెబ్ విగ్రహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాల వేసి నివాళు లర్పించి మాట్లాడారు. అంబేద్కర్ ఓ కులానికో వర్గానికో చెందినవాడు కాదని, అందరివాడని కీర్తించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే మనమందించే నివాళి అని చెప్పారు.
-కార్పొరేషన్, డిసెంబర్ 6
కార్పొరేషన్, డిసెంబర్ 5: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను బుధవారం క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి శేఖర్గౌడ్, పృథ్వీరాజ్, పిట్టల మధు తదితరులున్నారు.
విద్యానగర్, డిసెంబర్ 6: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిసి వేంకటేశ్వర స్వామి వారి శాలువాతో సన్మానించారు. ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ మల్లికార్జున్, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవి వర్మ, సురేందర్, రమేశ్ పాల్గొన్నారు.
కలెక్టరేట్, డిసెంబర్ 6: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పీవోపీ అసోసియేషన్ బాధ్యుడు జమీల్, రెగ్జిన్ షాప్ వర్కర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జహంగీర్, ఓల్డ్ టైర్స్ ఓనర్స్, వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమూద్ఖాన్, ఫ్లవర్ మర్చంట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకుడు మహ్మద్మొహియొద్దీన్ ఉన్నారు.