ఇల్లంతకుంట, నవంబర్ 18: ‘బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం.. గత తొమ్మిదిన్నర ఏండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి.. కాంగ్రెస్ను నమ్మితే గోసపడుతాం.. అని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శనివా రం ఆయన జవారిపేట, గాలిపెల్లి, ఆరెపల్లి, చింతలకుంట, సోమారంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా, గ్రామస్తులు, మహిళలు, వృద్ధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని, చేసిన అభివృద్ధి పనులను చూసి కారు గుర్తుకే ఓటేయాలన్నారు. దొంగ మొక్కులు, సాధ్యంకాని హామీలు ఇస్తున్న కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
ఇతర రాష్ర్టాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, ఇక్కడికి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం అధికార దాహంతోనే మాయమాటలు, అమలుకాని హామీలు ఇ స్తున్నదని ఆరోపించారు. 50ఏండ్లు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధిని, బీఆర్ఎస్ హయాం లో పదేండ్లలోనే చేసి చూపించామన్నారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, సెస్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అన్నాడి అనంతరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చింతపల్లి వేణురావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, సర్పంచులు మల్లుగారి వాణి, చింతలపెల్లి తిరుపతిరెడ్డి, కాచం శ్రీనివాస్రెడ్డి, సిద్ధం శ్రీనివాస్, పీఏసీఎస్, ఏఎంపీ డైరెక్టర్లు, ఉప సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.