జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 23: బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమమని, పనిచేసే ప్రభుత్వానికే మద్దతు పలుకాలని జగిత్యాల అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో వార సంత జరిగే అంగడి గద్దెల ప్రచారం చేశారు. జగిత్యాల నియోజకవర్గం, పట్టణానికి చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మూడో సారి అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలతో కూడిన మేనిఫెస్టోను అందించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని చిరువ్యాపారులు, ప్రజలను కోరారు.
అలాగే జగిత్యాల ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి అరుముల్ల శ్రీనివాస్ బీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆటోలకు ఫిట్నెస్ ఫీజును మాఫీ చేస్తామని, ఆటో డ్రైవర్లకు రూ. 5లక్షల బీమా కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జుంబర్తి రాజ్కుమార్, ఎఫ్సీఎస్ డైరెక్టర్ అరుముల్ల వపన్, పార్టీ పట్టణ కార్యదర్శి ప్రశాంత్రావు, సీనియర్ నాయకులు నాచుపెల్లి రెడ్డి, చందా పృద్వీధర్, నిరంజన్ పాల్గొన్నారు.