మెట్పల్లి, డిసెంబర్ 31: నితిన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. సంక్రాంతి కానుకగా పారిశుధ్య కార్మికులకు నితిన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన దుస్తులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు, పేద కుటుంబాలకు దుస్తుల పంపిణీ, ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం నిర్వహణ, నిరుపేదలకు ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ, ప్రతినెలా నిత్యావసర సరకుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్న ట్రస్ట్ నిర్వాహకులను ఆయన అభినందించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, కమిషనర్ జగదీశ్వర్గౌడ్ ,ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఆనంద్బాబు, కౌన్సిలర్లు మొరపు గంగాధర్, ఒజ్జెల బుచ్చిరెడ్డి, యామ రాజయ్య, మర్రి పోచ్చయ్య, లంక గంగాధర్, అంగడి పురుషోత్తం, మన్నే ఖాన్, ద్యావనపల్లి రాజారాం, బంగారుకాళ్ల కిశోర్, బర్ల రమేశ్, ఎనగందుల శ్రీనివాస్గౌడ్, భీమనాతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.