పెద్దపల్లి టౌన్ సెప్టెంబర్ 29: అక్టోబర్ 1న పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తన క్యాంపు ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు పర్యటన ఏర్పాట్లను ఏసీపీ మహేశ్తో కలిసి పరిశీలించారు. నియోజకవర్గంలో రూ. 86.77 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాన చేస్తారన్నారు. పెద్దపల్లిలో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. 25 కోట్లతో వివిధ వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారన్నారు.
రూ. కోటి ఎస్డీఎఫ్తో చేపట్టిన పనులు, రూ. 50 లక్షల పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన ప్రధాన చౌరస్తాల ఆధునీకరణ, రూ. 19.80 కోట్లతో జూలపల్లి నుంచి కాచాపూర్ మీదుగా పెద్దపల్లి వరకు బీటీ రోడ్డు, రూ. 10.95 కోట్లతో పెద్దపల్లి నుంచి కోలనూర్ మీదుగా ఓదెల వర కు బీటీ రోడ్డు, , రూ. 7 కోట్లతో పెద్దపల్లి నుంచి తుర్కల మద్దికుంటా మీదుగా జూల పల్లి వరకు బీటీ రోడ్డు, రూ. 5 కోట్లలతో ఓదెల నుంచి జగ్గయ్యపల్లి వరకు బీటీ రోడ్డు, రూ. 5.52 కోట్లతో దేవునిపల్లె నుంచి నర్సింహాస్వామి ఆలయం వరకు బీటీరోడ్డు,రూ. 5 కోట్లతో బొంపల్లి నుంచి అప్పన్నపేట వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. పార్టీ అన్ని విభాగాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు తరలిరావాలని కోరారు. ఇక్కడ ఎంపీపీ బండారు స్రవంతి, పీఏసీఎస్ చైర్మన్ మాధిరెడ్డి నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజుకుమార్, నాయకులు కసిరెడ్డి సతీశ్, కౌన్సిలర్ ఖదిర్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ తోట వెంకటేశ్, సీఐ అనిల్కుమార్, ఎస్ఐ మహేందర్ తదితరులు ఉన్నారు.