మేడిపల్లి, మే 10: రైతుబీమాతో సీఎం కేసీఆర్ రైతులకు దీమా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ప్కేన్నారు. బుధవారం ఆయన పోరుమల్ల గ్రామం నుంచి జోగిన్పల్లికి వెళ్లే రహదారిపై రూ.69 లక్షలతో నిర్మించే బ్రిడ్జికి, తొంబర్రావుపేట గ్రామంలో రూ.61 లక్షలతో నిర్మించే బ్రిడ్జి, కట్లకుంట గ్రామం నుండి తొంబర్రావుపేట గ్రామం వరకు రూ .83 లక్షలతో నిర్మించే రోడ్డు పనులకు, మేడిపల్లి మండల కేంద్రంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక, జడ్పీ హైస్కూల్లో మన ఊరు-మన బడిలో భాగంగా రూ 1.11 కోట్లతో చేపట్టే పనులు, కొండాపూర్లో రూ.20లక్షలతో పల్లె దవాఖాన, కాచారంలో రూ.20లక్షలతో జీపీ భవనం, వెంకట్రావుపేటలో రూ.1.22 లక్షలతో రెండు బ్రిడ్జిలు రూ.20లక్షలతో సబ్సెంటర్కు జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్రావు, ఎంపీపీ దోనకంటి ఉమాదేవితో కలిసి భూమిపూజ చేసి, శిలాఫలకాలను బుధవారం ఆవిష్కరించారు.
22 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కమ్మరిపేటలో కంటివెలుగు శిబిరంలో పాల్గొన్న వైద్యసిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో 65,126 మంది రైతులకు రైతుబంధు ద్వారా రూ.765కోట్లు అందించామన్నారు. ఇక్కడ సర్పంచులఫోరం మండలాధ్యక్షుడు వంగ వెంకటేశం, సర్పంచులు తౌటి తిరుపతిరెడ్డి, మామిడి సత్తవ్వ, గడ్డం నారాయణరెడ్డి, ఈర్నాల సంపత్కుమార్, క్యాతం వరలక్ష్మి, ద్యావనపెల్లి అభిలాశ్, చిట్యాల సురేశ్, కాటిపెల్లి జగన్రెడ్డి, పిట్టల లక్ష్మి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు చెన్నమనేని రవీందర్రావు, ఎంపీటీసీలు అంకం వినోద, మకిలి దాస్, పన్నాల లావణ్య, మ్యాదరి లక్ష్మి, సుధవేని లక్ష్మి, పల్లి అర్జున్, ఏఎంసీ చైర్పర్సన్ ఉదగిరి రమ్య, వైస్ చైర్మన్ కొప్పెర లింగారెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్ రమేశ్రెడ్డి, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్తిరెడ్డి ఉన్నారు.