వేములవాడ రూరల్/కోనరావుపేట/రుద్రంగి, జనవరి 5: సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అభయహస్తం ఆరు గ్యారెంటీలను ఆమలు చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారులు ఓపికతో దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. శుక్రవారం వేములవాడ రూరల్ మండలం వట్టెంల, కోనరావుపేట మండలం మల్కపేట, జరిగిన ప్రజాపాలన కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.
అనంతరం దరఖాస్తులను స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవో రాంరెడ్డి, ఎంపీటీసీ రంగు వెంకటేశ్గౌడ్, ఉపసర్పంచ్ మల్లేశం, డైరెక్టర్ రాజయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సర్పంచ్ ఆరె లత, డీటీ సత్యనారాయణ, ఉపసర్పంచ్ అంజయ్య, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ పాషా తదితరులు ఉన్నారు. రుద్రంగి మండలం వీరునితండాలో ప్రజాపాలనలో నిజామాబాద్ డీసీసీ మోహన్రెడ్డి, సర్పంచ్ మేన, ఎంపీడీవో శంకర్, అధికారులు పాల్గొన్నారు.
రుద్రంగి, జనవరి 5: మానాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవా రం రుద్రంగి మండలం మానాల గ్రామంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. నాయకులు ఆయనను గజమాలతో సన్మానించారు. ఇక్కడ నిజామాబాద్ డీసీసీ మోహన్రెడ్డి, సర్పంచ్ మానస, నాయకులు ఉన్నారు.