రుద్రంగి, నవంబర్ 11: నేను ఎప్పటికీ మీ బిడ్డనే.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఎల్లప్పు డు ఇలాగే ఉండాలి.. ఉమ్మడి మానాలపై ఉన్న ప్రేమతో 100కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తం డాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడినయ్.. మీ కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి.. అని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర రోడ్డు, భవనాల, రవా ణా, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. శనివారం ఆయన రుద్రంగి మండలం మానాలతో పాటు బడితం డా, దేగావత్తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, కులసంఘాల నాయకులు, మహిళలు మంగళహారతులు, బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ,100కోట్లతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. 762మంది గిరిజనులకు 1,750 ఎకరాల్లో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. మానాల ప్రజలంతా నా కుటుంబ సభ్యులేనని.. నా వద్దకు వచ్చిన ప్రతిఒక్కరికీ ఏ పనైనా చేశానన్నారు. హనుమాన్తండా నుంచి గొర్రె గుండం వరకు కోటీ12లక్షలతో బీటీ రోడ్డు, తాతమ్మ ఒర్రె వద్ద 2.20కోట్లతో బ్రిడ్జి పనులు, 60లక్షలతో 11 కుల సంఘాలకు ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. బడితండాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గైదిగుట్టతండాలో రెసిడెన్షియల్ పాఠశాల నిర్మా ణం చేపట్టామన్నారు. గిరిజన తండాలను కలుపుతూ 6.5 కిలో మీటర్ల రింగు రోడ్డుకు బీటీ రో డ్డు వేశామన్నారు.
నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు 20లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామన్నారు. 8.50కోట్లతో మా నాల-మరిమడ్ల రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సం క్షేమం సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ మోసపు మాటలు నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు తొట్టిపాటి నరసింహనాయుడు, కమ్మర్పల్లి జడ్పీటీసీ రాజాగౌడ్, వైస్ఎంపీపీ పీసరి భూమయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఏలేటి చిన్నారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేగావత్ తిరుపతి, ఎంపీటీసీ గుగులోత్ గంగీబాయి, సర్పంచులు దేగావత్ సరిత, మోహన్, మంగీలాల్, రమణయ్య, మాలీ, లలిత, సరిత, మేన, నేతలు రాజారాం, అంబర్సింగ్, సుంద ర్, నరేశ్నాయక్, నాయిని రాజేశం, రాందాస్, గజన్, భూమనాయక్ పాల్గొన్నారు.