గంభీరావుపేట, అక్టోబర్ 7: గంభీరావుపేటలో ఈ నెల 11న జరిగే కేజీ టూ పీజీ విద్యాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి రావాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించారు.
కొండూరి ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సర్పంచ్ శ్రీధర్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అహ్మద్తో శుక్రవారం హైదరాబాద్లో మంత్రిని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యాసముదాయ భవన నమూనాను అందజేసి, ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు.