పెద్దపల్లి, నవంబర్ 22(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి/ గోదావరిఖని నవంబర్ 22: స్వరాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చిన బీఆర్ఎస్ సర్కారును ఆదరించాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ఆలీ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. తనకు హోంమంత్రిగా అవకాశం ఇవ్వడమే ఇం దుకు నిదర్శనమని చెప్పారు. బుధవారం పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్స్, మార్కండేయ కాలనీ బృం దావన్ గార్డెన్స్లో ముస్లిం మైనార్టీల ఆత్మీయ స మ్మేళనాలు నిర్వహించారు. అలాగే రామగుండం లో బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటికి మద్దతుగా రోడ్ షో చేపట్టారు.
ఆయాచోట్ల హోమంత్రి మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. యాభై ఏండ్లు కాంగ్రెస్ పాలన కర్ఫ్యూ, కన్నీళ్లతోనే గడిచిపోయిందని గుర్తు చేశారు. కానీ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మతకల్లోలాలు, కన్నీళ్లు లేవని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిది ఆర్ఆర్ఎస్ భావజాలమని, రాజకీయంగా ఎదిగేందుకు డీడీపీలో చేరాడని, టీడీపీ దుకాణం బంద్ కాగానే కాంగ్రెస్లో చేరాడని విమర్శించారు. ఢిల్లీ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ముస్లిం మైనార్టీలను పట్టించుకోలేదన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడంలో ముస్లిం మైనార్టీలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పదేండ్ల కింద పెద్దపల్లి ఎలా ఉంది? ఇప్పడేలా ఉంది ఆలోచించి ఓటు వేయాలన్నారు.
ఎన్నికల వేళ ఆగం కావద్దని, అభివృద్ధి, అభ్యర్థి ప్రవర్తన, పార్టీ చరిత్రను మదిలో పెట్టుకోని ఓటు వేయాలని కోరారు. ముస్లిం అన్ని విధాలుగా అండగా ఉంటున్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. ఇక్కడ దాసరి మనోహర్రెడ్డి, అక్కడ కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు.
కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, టీఎస్ఎంఎఫ్సీ చై ర్మన్ ఇంతియాజ్ ఇసాక్. అక్బర్, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ నాజ్మిన్ సుల్తానామొబిన్, ఓదెల జెడ్పీటీసీ గంట రాములు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీ సత్యనారాయణ రెడ్డి, హమీద్, బేగ్, ప్రజాప్రతినిధులు, నాయకులు లైసెట్టి భిక్షపతి, దేవనంది రమాదేవి, గాదె మాధవి, వునుకొండ సుజాత, సునీల్, రేవెళ్లి స్వామి, మొబిన్, పైడ రవి, అస్రఫ్, ఖదీర్ఖాన్, ఫహీం, జావిద్, జాకిర్ హుస్సెన్, సర్వర్, తబ్రేజ్ పాల్గొన్నారు.
కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది. అన్ని మతాలకు సమ ప్రాదాన్య త ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. పేద ముస్లిం లు పవిత్ర రంజాన్ను ఘనంగా జరుపుకునేందు కు ప్రభుత్వం కానుకలకు అందజేస్తుంది. ఇమాం, మౌజంలకు గౌరవ వేతనం ఇచ్చింది. కాంగ్రెస్ ముస్లిం సంక్షేమాన్ని ఎనాడు పట్టించుకోలేదు. 2014లో నేను ఎమ్మెల్యే కాగానే తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేసిన. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందుతున్నది. పెద్దపల్లిలో గల్లీ గల్లీకి సీసీ రోడ్డు, డ్రైనేజీ వేయించిన. పెద్దపల్లి ఈద్గాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన. మళ్లీ గెలిస్తే భవిష్యత్తులో మరిన్నీ అభివృద్ధి పనులు చేస్తా. ముస్లింలు ఓటు వేసి ఆశీర్వదించాలి.
జ్యోతినగర్(రామగుండం), నవంబర్ 22: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేశారని, గత ప్ర భుత్వాలు కేవలం ముస్లింలను ఓటు బ్యాంకును వాడుకున్నాయని, హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బు ధవారం సాయంత్ర రామగుండం మసీద్ టర్నింగ్లో రోడ్షో నిర్వహించారు. ప్రచార రథంపై హోం మంత్రి ముస్లింలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలోనే ముస్లింల పేద కుటుంబాలకు షాదీ ముబారక్ పథకం, పిల్లలకు మైనారిటీ హస్టల్స్ వచ్చాయన్నారు. ముస్లింల అభ్యున్నతికి కేసీఆర్ కృషిచేస్తున్నారని ముస్లిం మైనారిటీలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అండగా నిలవాలన్నారు.
రా మగుండం ఎమ్మెల్యే బరిలో నిలిచిన కోరుకంటి చందర్ను గెలిపించుకోని ఇక్కడి బీ థర్మల్ విద్యు త్ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇక్కడ వక్స్బోర్డు చైర్మన్ అక్బర్ హుస్సెన్, రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్, మేయర్ డాక్టర్ అనిల్కుమార్, కార్పొరేటర్లు కౌశికలత, కన్నూరి సతీశ్కుమార్, ముదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కౌశికహరి, ఎండీ సాజీర్, అహమ్మద్బాబు, బొడ్డుపల్లి శ్రీనివాస్, తిరుపతి, కుమార్, గంగాప్రసాద్, తదితరులు ఉన్నారు.