రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పలు చోట్ల మొక్కలు నాటి, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా వితరణలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పలు ఆలయాల్లో పూజలు చేశారు. పలుచోట్ల రక్తదానాలు, అన్నదానాలు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పేదలు, వృద్ధులకు పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భారీ కేకులు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కాగా, కరీంనగర్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని బర్త్డే కేకులు కట్ చేశారు.
– కరీంనగర్, జూలై 24(నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూలై 24(నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ 48వ పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ జిల్లా, పట్టణ, మండల శాఖలు, ఆర్బీఎస్, విద్యార్థి విభాగం, కార్మిక విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. డైనమిక్ లీడర్.. ప్రగతి ప్రదాత నూరేళ్లు వర్ధిల్లాలని ప్రజలంతా మనసారా దీవించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్లు కట్ చేసి స్వీట్లు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదానాలు, అన్నదానాలు నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వితరణ కార్యక్రమాలు చేపట్టి మానవత్వం చాటుకున్నారు.