Minister KTR | రాజన్న సిరిసిల్ల, జూలై 5 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్రాం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి జిల్లా సమీకృత కలెక్టరేట్కు చేరుకొని మధ్యాహ్నం 12 గంటలకు 124 మంది చిరువ్యాపారులకు ఆర్థిక సాయం అందజేస్తారు. 12:30 గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో 1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తారు.
సిరిసిల్ల బీఆర్ఎస్వీ యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్ తండ్రి ఇటీవల మృతి చెందగా, 3 గంటలకు వారి స్వగ్రామం విలాసాగర్కు వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా, బుధవారం పద్మనాయక కల్యాణ మండపంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయనవెంట ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివాసరావు తదితరులున్నారు.