గంభీరావుపేట, జనవరి 5: అతి జ్వరంతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన బీఆర్ఎస్ నాయకుడు మాడ్గుల రమేశ్ మెరుగైన వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసాగా నిలిచారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన రమేశ్ పది రోజుల క్రితం తీవ్ర జ్వరంతో అనారోగ్యానికి గురయ్యాడు. చేతులు, కాళ్లలో చలనం లేకపోవడంతో పరీక్షించిన వైద్యులు, మెరుగైన వైద్యం అందించాలని, చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని కుటుంబ సభ్యులకు సూచించారు.
బాధిత కుటుంబం దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, స్థానిక ఎంపీపీ వంగ కరుణ, సర్పంచ్ అక్కపల్లి స్వరూప కలిసి విషయాన్ని మంత్రి కేటీఆర్కు తెలియజేయగా, వెంటనే స్పందించారు. రమేశ్కు మెరుగైన వైద్యం కోసం రూ.2.50లక్షల ఎల్ఓసీని మంజూ రు చేశారు. సదరు పత్రాన్ని పార్టీ నాయకుడు వెంకటేశ్గౌడ్ వెళ్లి హైదరాబాద్లోని నిమ్స్లో బా ధిత కుటుంబానికి అందజేశారు. దీంతో రమేశ్కు వైద్యులు చికిత్స ప్రారంభించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అడగ్గానే సాయం చేసిన మం త్రి కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని రమేశ్ కుటుంబ సభ్యులు తెలిపారు.