వెల్గటూర్, అక్టోబర్ 16 : రోడ్డు ప్రమాద బాధితురాలికి అమాత్యుడు కొప్పుల ఈశ్వర్ ఆపన్న హస్తం అందించారు. చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేసి అండగా నిలిచారు. గత నెల లో గొల్లపల్లి మండలంలోని గోవింద్పల్లి స్టేజీ వద్ద ఆటో,ఆయిల్ ట్యాంకర్ ఢీకొని వెల్గటూర్కు చెంది న బందేల రాజేశ్వరి తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్నది.
చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుండడంతో ఆ పేద కుటుం బం తల్లడిల్లుతున్నది. వారి ఆర్థిక పరిస్థితిని టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు మంత్రి కొప్పులకు వివరించారు. స్పందించిన మంత్రి రూ.2.50 లక్ష ల ఎల్వోసీని రాజేశ్వరి కుటుంబ సభ్యులకు ఆదివారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈసందర్భంగా మంత్రికి రాజేశ్వరి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.